పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ బుధవారం తాడిగడప మున్సిపాలిటీ, పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఒకే రాజధాని, అభివృద్ధి కేంద్రీకరణ లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రజలు కలలు కన్న అమరావతిని ఏపీ క్యాబినెట్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసిందని, దీనికి పార్లమెంటు రాజముద్ర కూడా లభించిందని ఆయన పేర్కొన్నారు.