పోరంకి నారాయణపురం కాలనీలో భర్త మృతి చెందిన ఐదేళ్ల తర్వాత భార్య జాస్తి శ్రీదేవి(48) ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఇంట్లోకి వెళ్లి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిశీలించగా, ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త జ్ఞాపకాల భారమే ఆమె ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.