గంపలగూడెం మండలం పెనుగొలను శివాలయంలో బుధవారం అయ్యప్ప స్వామి గురు స్వాములకు ఘనంగా సన్మానించారు. 37వ సారి అయ్యప్ప మాల ధరించిన గుంత వెంకటేశ్వర్లు, 18వ సారి మాల ధరించిన బుడుపుల రామకృష్ణ స్వాములను ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి గౌరవించారు. అనంతరం దాతల సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. నరసింహారావు, అయ్యప్ప మాలదారులు పాల్గొన్నారు.