విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం నేపథ్యంలో టీడీపీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు ఉపక్రమించింది. ఈనెల 4న ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని కొలికపూడికి, అదే రోజు సాయంత్రం 4 గంటలకు రావాలని చిన్నికి సమాచారం అందించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరితో మాట్లాడనుంది.