విజయవాడ కృష్ణ లంక గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో, సీఐ నాగరాజు దాఖలు చేసిన ఇంటి భోజనానికి అనుమతి పిటిషన్పై జిల్లా కోర్టు విచారణ జరిపి, ఆయనకు ఇంటి భోజనం అందించేందుకు అనుమతించింది. మరోవైపు, సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణను జులై 1కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.