ఎన్టీఆర్ జిల్లాలో సినిమా తరహాలో జరిగిన హత్య కేసులో మద్యం సీసాపై ఉన్న QR కోడ్ పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. తిరువూరు నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనలో, అలేఖ్య అనే మహిళ తన ప్రియుడు కృష్ణసేనతో కలిసి భర్త రాజేష్ను హత్య చేసింది. ఏప్రిల్ 21న రాజేష్కు మద్యం తాగించి, కడప జిల్లాకు చెందిన సుపారీ గ్యాంగ్ సహాయంతో హత్య చేసి, మృతదేహాన్ని NSP కాలువలో పడేశారు. అనుమానం రావడంతో బంధువులు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తులో మద్యం బాటిల్ QR కోడ్ ద్వారా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.