అజిత్ సింగ్ నగర్ సీఐ చంద్రశేఖర్ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేట కేజీఎఫ్ అపార్ట్మెంట్స్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 1700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపుతున్నామని ఆయన పేర్కొన్నారు.