కడప జిల్లా గోపవరం మండలం పీపీ. కుంట సమీప అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా, స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బద్వేలు ఆస్పత్రికి తరలించారు.