విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 36వ పుస్తక ప్రదర్శన నేటి నుంచి ప్రారంభమైంది. ఈనెల 12 వరకు జరిగే ఈ ప్రదర్శనలో సుమారు 300 స్టాళ్లలో వేలాది పుస్తకాలు 10 శాతం రాయితీతో అందుబాటులో ఉంటాయి. ఈనెల 6న సీఎం చంద్రబాబు, 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఉత్సవానికి హాజరుకానున్నారు. పుస్తక ప్రేమికులు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శించవచ్చు.