నకిలీ మద్యం కేసులో మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన ఇంటికి ఉదయం 5 గంటలకే వెళ్లారు. దీంతో జోగి రమేష్ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. అధికారులు జోగి రమేష్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.