విజయవాడలో RSS చీఫ్ మోహన్ భగవత్ పర్యటిస్తున్నారు. నేడు ఆయన 'భవిష్య భారతీయం' కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, సామాజిక అంశాలపై చర్చలు జరగనున్నాయి. సీఎం ఏర్పాటు చేసిన డిన్నర్ మీటింగ్లో రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు ఈ చర్చలు కొనసాగుతాయి.