నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు స్వయంగా బందోబస్తును పర్యవేక్షించారు. అర్ధరాత్రి నుంచి విధుల్లో ఉన్న ఆయన, ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద కేక్ కట్ చేసి పోలీస్ అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణ కాంత్ పటేల్, షరీనా బేగం, ఎస్. వి. డి. ప్రసాద్, ఏసీపీలు, అధికారులు పాల్గొన్నారు.