భవానీపురంలో బుధవారం అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ 42 ఫ్లాట్లను కూల్చివేశారు. గత 25 ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో బాధితులకు వాగ్వాదం చోటుచేసుకుని, ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.