వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం
జగన్ పీఏ KNR (కె. నాగేశ్వరరెడ్డి) పై సిట్ అధికారులు దృష్టి సారించారు. విజయవాడలో రెండవ రోజు ఆయన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపారు. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన లంచాల సొమ్ముతో కేఎన్ఆర్, ఆయన భార్య పేరిట కోట్ల విలువైన ఆస్తులు, భూములు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. అధికారులు సోమవారం మరోసారి విచారించనున్నట్లు తెలిపారు.