భారతీయ వారసత్వ సంపద యోగాను అందరికీ చేరువ చేయాలన్నదే యోగాంధ్ర-2025 లక్ష్యం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పోలవరం జరిగిన యోగాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్వాసపై ధ్యాసతో తనువు మనసును ఏకం చేసి సుసంపన్న ఆరోగ్యానికి బాటలు వేస్తుందన్నారు. యోగా ఔన్నత్యాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికీ చేరువచేయాలనేదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశం అని అన్నారు.