విజయవాడ: ఆయేషా తల్లిదండ్రుల పిటిషన్పై సీబీఐ కోర్టు విచారణ

7చూసినవారు
విజయవాడ: ఆయేషా తల్లిదండ్రుల పిటిషన్పై సీబీఐ కోర్టు విచారణ
ఆయేషా మీరా తల్లిదండ్రుల పిటిషన్పై విజయవాడ సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీబీఐ పునర్విచారణ నివేదిక కాపీలను అప్పగించాలని కోరుతూ ఆయేషా తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. నివేదిక కాపీలను పిటిషనర్లకు అందజేస్తామని సీబీఐ తెలిపింది. నివేదిక పరిశీలించాక అభ్యంతరాలు చెబుతామని ఆయేషా తల్లిదండ్రులు వెల్లడించారు. తదుపరి విచారణను కోర్టు నవంబర్ 21కి వాయిదా వేసింది.

ట్యాగ్స్ :