విజయవాడలో జరిగిన ఐజేయూ 11వ ప్లీనరీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మూడు దశాబ్దాలుగా జర్నలిస్టులతో తనకు అనుబంధం ఉందని తెలిపారు. ప్రతిరోజూ వచ్చే వార్తాంశాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని, మీడియాకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. అయితే, ప్రస్తుతం మీడియా తీరు మారిందని, అబద్ధాలను చిత్రీకరిస్తూ తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆయన ఆరోపించారు. విలేకర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.