తాడేపల్లిలో నివాసముంటున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇంట్లో మంగళవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమ ఆస్తులను గుర్తించిన అధికారులు భారీగా బంగారం, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శాంతిని తాడేపల్లిలో అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.