కొందరు పోలీసులు న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆదోని బార్ అసోసియేషన్ ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేసింది. సోమవారం ఆదోని టూటౌన్ సీఐపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలీస్ శాఖ విశ్వనీయతను దెబ్బతీస్తున్నారని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తీసుకురావాలని కోరారు. ఎస్పీ సానుకూల స్పందన తెలిపారు. తర్వాత బార్ అసోసియేషన్ కలెక్టరేట్లో ధర్నా నిర్వహించి, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ బార్లు మద్దతు పలకుతూ పాల్గొన్నారు.