బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వివిధ వర్గాల ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. న్యాయబద్ధమైన సమస్యలను సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.