డోన్ పట్టణంలో ప్రభుత్వ సర్వేలు, ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా విధులకు గైర్హాజరైన 8 మంది సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీలను మునిసిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ మంగళవారం సస్పెండ్ చేశారు. కేటాయించిన పనులు పూర్తి చేయకపోవడం, ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పెండింగ్ సర్వేలు పూర్తిచేసిన తరువాతే విధుల్లోకి తీసుకుంటామని హెచ్చరించారు.