కొత్తబుర్జు గ్రామంలో రూ. 30 లక్షల వ్యయంతో ఇంటింటికి తాగునీటి పైప్లైన్ పనులకు ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి శంకుస్థాపన చేశారు. ఈ పనుల ద్వారా గ్రామ తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించబడుతుందని తెలిపారు. అధికారులు టాయిలెట్లు, విద్యుత్, రోడ్లు, కాలువల అభివృద్ధిపై కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.