డోన్లోని సీపీఐ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకులు పట్టణ సీఐ ఇంతియాజ్ బాష అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ సీపీఐ నేతలపై దాడి చేశారని ఆరోపించారు. అవినీతిని బయటపెట్టినందుకే తమను నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వారు తెలిపారు. సీఐను సస్పెండ్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా మహిళలతో నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు.