కర్నూలు నగర పరిధిలోని శివారు ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్ర బాబు తెలిపారు. శనివారం పెద్దపాడు, వై. జంక్షన్, బి. క్యాంపు, సి. క్యాంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, రహదారుల నిర్మాణం, మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను మెరుగుపరచాలని, రహదారులపై స్పీడ్ బ్రేకర్లకు సింబల్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.