పెద్దకడబూరు మండలంలోని నౌలేకల్ గ్రామంలో శుక్రవారం జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వే వెరిఫికేషన్ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ వలిబాషా పరిశీలించారు. సర్వే నిర్వహణ తీరును సమీక్షించి, సిబ్బందికి పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ప్రజల వివరాలను నమోదు చేయాలని సూచించారు. పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా సహకరించి సరైన సమాచారం అందించాలని కోరారు.