నందికొట్కూరులో కొణిదేల పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రవికుమార్ అనారోగ్యంతో కర్నూలులోని గౌరి గోపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆసుపత్రికి వెళ్లి రవికుమార్ను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.