నందికొట్కూరు నియోజకవర్గం, పాములపాడు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 8,46,581 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.