నందికొట్కూరు మండలం జలకనూరు గ్రామానికి చెందిన పాణ్యం మనోహర్ బాబు గ్రూప్-2 పరీక్షల్లో ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. ఆర్టీసీ కండక్టర్ చిన్న బాలన్న, పుష్పవతి దంపతుల కుమారుడైన మనోహర్, తన పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. ఆయన విజయం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేయగా, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.