నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని అన్న క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, భోజనశాల, ఆహార తయారీ విధానం, పరిశుభ్రతను పరిశీలించి, స్వయంగా భోజనం చేసి నాణ్యత, రుచి, సమయపాలనపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్లలో పరిశుభ్రత, నిర్ణీత సమయానికి భోజన సేవలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి ఆదేశించారు.