ఉయ్యాలవాడ మండలంలోని సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, రైతులకు వ్యవసాయ విద్యుత్ను ఉదయం 3 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందజేస్తామని వెల్లడించారు. వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.