ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాలలో 42 నుంచి 52, ఆత్మకూరులో 28 నుంచి 32, నందికొట్కూరులో 29 నుంచి 32, ఆళ్లగడ్డలో 27 నుంచి 32, డోన్లో 32 నుంచి 36, బేతంచెర్లలో 20 నుంచి 28కు పెంచారు. ఈ నిర్ణయంతో స్థానిక రాజకీయాల్లో ఆశావహులు మరింత ఉత్సాహంగా ఉన్నారు.