నంద్యాల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడిన గజదొంగ సోహైల్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 42 తులాల బంగారు ఆభరణాలు, సుమారు రూ. 65 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు, నంద్యాల ప్రాంతాలలో పగటిపూట చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పలుచోట్ల కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.