నంద్యాల జిల్లా మహానంది పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. U. బొల్లవరం గ్రామంలో అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేసి, సరైన ధ్రువపత్రాలు లేని నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించారు.