మహానంది మండలానికి రెగ్యులర్ తహశీల్దారుగా పి. రమాదేవిని నియమిస్తూ కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్న ఆమెకు పదోన్నతి కల్పించారు. తాత్కాలిక బాధ్యతలు నిర్వహించిన రమాదేవి ఇకపై పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించనున్నారు.