ఆత్మకూరు పట్టణంలో ఆదివారం టీడీపీ శ్రేణులు వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలిపారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు అంబటి దిష్టిబొమ్మను దహనం చేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, అంబటిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.