ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం, వైసీపీ ఇంచార్జ్ బుట్టా రేణుక నేతృత్వంలో అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం ఒక డిజిటల్ బుక్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా కార్యకర్తలు తమ ఫిర్యాదులను వెబ్ లింక్ లేదా 040-49171718 ఫోన్ నంబర్ ద్వారా రెండు విధాలుగా నమోదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సీనియర్ కార్యకర్తలు, మాండల, వార్డు స్థాయి నాయకులు పాల్గొన్నారు.