ఆదోని పట్టణంలోని అఫిసరాళ్లకొండలో శనివారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ సైదుల్ ఆధ్వర్యంలో నాటుసారా స్థావరంపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 260 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడంతో పాటు 12 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఆదోని పట్టణం వాల్మీకినగర్కు చెందిన బోయ వెంకటేష్పై కేసు నమోదు చేయగా, ప్రశాంత నగర్కు చెందిన బోయ గుంటెమ్మను అరెస్టు చేసి, 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.