ఆదోని పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి ధరలు స్వల్పంగా పడిపోయాయి. గరిష్టంగా క్వింటాకు రూ. 7, 429 ధర పలకడంతో, ఇది ప్రభుత్వ కనీస మద్దతు ధర కంటే రూ. 1, 200 తక్కువగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ స్లాట్ బుకింగ్ సమస్య కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్కు వచ్చిన 6, 553 క్వింటాళ్ల పత్తికి కనిష్టంగా రూ. 4, 099, మధ్యస్థంగా రూ. 7, 201, గరిష్టంగా రూ. 7, 429 ధర నమోదైంది.