రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కర్నూలు జిల్లాలోని ఆదోనిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని బీఎస్పీ నాయకులు శాంతకుమార్, రాజ్కుమార్, సోమసుందరం ఆదివారం డిమాండ్ చేశారు. ఆదోని జెడ్పీ ప్రాంగణంలో వారు మాట్లాడుతూ, అభివృద్ధిలో అత్యంత వెనుకబడిన ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలన్నారు. ఒకవేళ జిల్లాగా ప్రకటించకపోతే, కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో కలపాలని వారు కోరారు.