ఆదోనిలో విద్యుదాఘాతంతో ఇంటర్ విద్యార్థి మృతి

3508చూసినవారు
ఆదోనిలో విద్యుదాఘాతంతో ఇంటర్ విద్యార్థి మృతి
ఆదోని పట్టణంలోని మాసా మసీదు కాలనీలో గురువారం ఇంటర్ విద్యార్థి తన్వీర్ (17) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇంట్లో మోటార్ ఆన్ చేసే సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురవ్వడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్