కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదివారం ఒక ప్రకటనలో, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం సోమవారం ఉదయం 9.30 గంటలకే ప్రారంభమవుతుందని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా, జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని సాధారణ సమయానికి ముందే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించే ప్రక్రియను ఉదయం వేళల్లోనే పూర్తి చేయాలని సూచించారు. ఈ మార్పును గమనించి ప్రజలు సమయానికి హాజరై తమ సమస్యలను వినిపించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.