ఆదోని పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, పాత బ్రిడ్జి, ఆర్ట్స్ కాలేజ్ ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లపై పోలీసులు మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వన్ టౌన్, ట్రాఫిక్ సీఐలు చంద్రశేఖర్, మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రైవ్లో, కొందరు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం, యూనిఫామ్ ధరించకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం వంటి లోపాలను పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి లోపాలను నియంత్రించేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.