సిరివెళ్లకు చెందిన గాజుల రిజ్వాన్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని తెలుసుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెంటనే స్పందించారు. అధికారులతో మాట్లాడి, రిజ్వాన్ చికిత్స కోసం ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయించారు. మంగళవారం ఆమె రిజ్వాన్ కుటుంబ సభ్యులకు ఎల్బీసీ పత్రాన్ని అందజేసి ధైర్యం నూరిపోశారు.