డోన్‌లో ప్రజావేదిక సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ

4చూసినవారు
డోన్‌లో ప్రజావేదిక సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ
డోన్ టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజావేదికలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రజల నుండి నీటి సరఫరా, రోడ్లు, పింఛన్లు, విద్యుత్, ఆరోగ్య సదుపాయాలపై సమస్యలను స్వీకరించారు. ఈ వినతులను పరిశీలించి సంబంధిత శాఖలకు వెంటనే సూచనలు జారీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని, ఎప్పుడైనా సమస్యలు తెలియజేయవచ్చని ఆయన ప్రజలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్