బనగానపల్లె వద్ద ఆటో బోల్తా 14 మందికి గాయాలు.. ఒకరి మృతి

14చూసినవారు
బనగానపల్లె వద్ద ఆటో బోల్తా 14 మందికి గాయాలు.. ఒకరి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం దద్దనాల చెరువు సమీపంలో మంగళవారం ఆటో బోల్తా పడి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. దురదృష్టవశాత్తు, ఒక వృద్ధ మహిళ మృతి చెందగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్