బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంగళవారం, మంత్రి బి. సి. జానర్దన్ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. వివిధ వర్గాల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరిత పరిష్కారానికి హామీ ఇచ్చారు. న్యాయబద్ధమైన అంశాలపై అక్కడిక్కడే అధికారులతో ఫోన్లో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.