బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలం ముదిగేడులో పర్యటించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీపీ పాఠశాల నూతన భవన నిర్మాణ పనులు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు అమలుకాకపోవడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. పనుల్లో పురోగతి లేకపోవడాన్ని గమనించి, "మంత్రి చెప్పినా చేయలేని అసమర్థ స్థితిలో ఉన్నారా" అని అధికారులను ప్రశ్నించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.