డోన్లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ విజయం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.