కర్నూలు జిల్లాలో గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీల పనితీరును సమీక్షించేందుకు జిల్లాకు వచ్చిన అఖిల భారత సర్వీసుల అధికారులతో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి శనివారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధి పురోగతిపై సవివరంగా చర్చించారు. ప్రజా సేవల మెరుగుదల కోసం అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.