కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుడు డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. యోగాలో
విద్యార్థులు రాణించాలని ఆకాంక్షిస్తూ, మన సంస్కృతిని ప్రతిబింబించే యోగాన్ని ప్రోత్సహించాలని అన్నారు. క్రీడల అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు.